నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
కృష్ణ నామస్మరణతో పులకించే బ్రజభూమిలో భక్తికి పరాకాష్ట బృందావనం. ఇక్కడ అడుగడుగునా మురళీకృష్ణుని లీలలు వినిపిస్తాయి. అయితే, ఆ నల్లనయ్యనే తన పతిగా పొందాలని గోపికలు ఏ దేవతను ప్రార్థించారో తెలుసా? సాక్షాత్తు 51 శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న 'మా కాత్యాయనీ' దేవిని! సతీదేవి కేశాలు పడిన ఈ పుణ్యస్థలి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.
సతీదేవి కేశాలు పడిన చోటుపురాణ గాథల ప్రకారం.. దక్షయజ్ఞంలో ప్రాణత్యాగం చేసిన సతీదేవి పార్థివ దేహాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు, ఆమె 'కేశాలు' ఈ బృందావన క్షేత్రంలో పడ్డాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దీనిని 'ఉమా శక్తిపీఠం' అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కాత్యాయనీ దేవిగా, స్వామి భూతేశ్వరుడిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు.
గోపికల తపస్సు..ఇసుక విగ్రహారాధనద్వాపర యుగంలో శ్రీకృష్ణుని దివ్య రూపాన్ని చూసి ముగ్ధులైన గోపికలు, ఆ పరమాత్ముడిని తమ భర్తగా పొందాలని ఆకాంక్షించారు. ఇందుకోసం వారు ఎంచుకున్న మార్గం 'కాత్యాయనీ వ్రతం'. ఇసుక విగ్రహం..యమునా నదీ తీరంలో ఇసుకతో అమ్మవారి ప్రతిమను రూపొందించి, అత్యంత నిష్టతో పూజించారు. వీరి భక్తికి మెచ్చిన దేవి వరాన్ని ప్రసాదించింది. ఫలితంగానే శరత్ పౌర్ణమి నాటి 'మహారాస లీల'లో కృష్ణుడు ప్రతి గోపికకు తానుగా మారి దర్శనమి చ్చాడు. ఈనాటికీ వివాహం కాని యువతీయువకులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే, గ్రహ దోషాలు తొలగి త్వరగా కళ్యాణ ఘడియలు వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
హిమాలయ యోగి సంకల్పం.నేడు మనం చూస్తున్న ఈ అద్భుత ఆలయ నిర్మాణం వెనుక స్వామి కేశవానంద మహారాజ్ కృషి మరువలేనిది. హిమాలయాల్లో 33 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసిన ఈ యోగికి, బృందావనంలో కనుమరుగైన ఈ శక్తిపీఠాన్ని పునరుద్ధరించాలని దైవప్రేరణ కలిగింది. తన యోగశక్తితో సరైన ప్రదేశాన్ని గుర్తించి, 1923లో పాలరాతితో ఈ దివ్యాలయాన్ని నిర్మించారు.
దర్శనీయ విశేషాలుఅష్టధాతు విగ్రహం.. గర్భాలయంలో అమ్మవారు అష్టధాతువులతో చేసిన భారీ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి చేతుల్లో అభయ, వర ముద్రలతో పాటు ఖడ్గం, పద్మం ఉంటాయి. పంచదేవ ఆరాధన.. ఇక్కడ కేవలం శక్తి ఆరాధన మాత్రమే కాదు.. విష్ణువు, శివుడు, సూర్యుడు, గణేశుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది సనాతన ధర్మంలోని 'పంచాయతన' పద్ధతికి ప్రతీకగా నిలుస్తుంది.
సింహ ద్వారం.. ఆలయ ద్వారం వద్ద ఉన్న రెండు భారీ స్వర్ణ సింహాలు అమ్మవారి పరాక్రమానికి గుర్తుగా నిలుస్తాయి. బృందావనం వెళ్లే భక్తులు కేవలం రాధాకృష్ణులను మాత్రమే కాకుండా, బ్రజభూమికి రక్షకురాలైన కాత్యాయనీ దేవిని దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని చెబుతుంటారు. ఆ తల్లి పాదాల చెంత కోరుకున్న ప్రతి కోరికా నెరవేరుతుందన్నది అక్షర సత్యం..!
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post