నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
దేశంలో కొన్ని రహస్యాల కారణంగా ప్రసిద్ధి చెందిన అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న ఈ ఆలయం అనేక నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. శ్రీ తిరుమల తిరుపతి ఆలయం, విశ్వ రక్షకుడైన విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి ప్రసిద్ధి. తన భక్తులను కష్టాల నుంచి రక్షించడానికి వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతరించారు. వెంకటేశ్వర స్వామి కళ్ళకు తెల్లటి ముసుగు కప్పి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఉనికి లేకుండా కలియుగం అంతం కాదని అంటారు. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఎప్పుడైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించినప్పుడు గానీ లేదా స్వామివారి కళ్ళు మూసుకుని ఉంటాయని మీరు ఎప్పుడైనా విన్నారా..? ఆ సీక్రెట్ వెనుక ఉన్న కారణం మీకు తెలుసా..? దీని వెనుక ఉన్న రహస్యాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
స్వామివారికళ్ళు ఎందుకు మూసుకుని ఉంటాయి..?వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకుని ఉండటం వెనుక ఉన్న రహస్యం ఇదే.
కలియుగంలో వెంకటేశ్వర స్వామి తిరుపతి ఆలయంలో కొలువై ఉంటారని నమ్ముతారు భక్తులు . శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్లు ప్రకాశవంతమైన, శక్తివంతమై ఉంటాయట. ఆయన కళ్ళలో ఉండే విశ్వశక్తి కారణంగా భక్తులు నేరుగా స్వామివారి కళ్ళలోకి చూడలేరని అంటారు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్ళను తెల్లటి ముసుగుతో కప్పుతారు. గురువారాల్లో మాత్రమే ఈ ముసుగును తొలగిస్తారు, అప్పుడు భక్తులు ఆయన కళ్ళను క్షణకాలం పాటు దర్శించుకోవడానికి వీలుకలుగుతుంది. గురువారం రోజున, శ్రీ వెంకటేశ్వర స్వామికి చందనంతో అభిషేకం చేస్తారు. గురువారాల్లో, శ్రీ వెంకటేశ్వర స్వామికి చందనంతో అభిషేకం చేసి, ఆ తర్వాత ఆయన విగ్రహానికి పూస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయానికి చందనం పూయడం వల్ల సిరి, సంపదలకు నెలవైన లక్ష్మీదేవి స్వరూపం ఆ చందనం ముద్రగా ఏర్పడుతుందని అంటారు.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post