నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
చిన్న సహాయమైనా ఆపదలో ఉన్నప్పుడు అది ఎంతో విలువైనది. సాయం చేయాలనే సంకల్పానికి పరిమాణం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం అని చాటిచెప్పే అద్భుత ఘట్టం రామాయణంలోని 'ఉడుత భక్తి'. భగవంతుడి సేవలో లీనమవ్వడానికి అంతస్తులు, శారీరక బలాలు అవసరం లేదని నిరూపించిన ఈ వృత్తాంతం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. అసలు ఉడుత వీపుపై ఆ మూడు చారలు ఎలా వచ్చాయో, ఆ వెనుక ఉన్న పరమార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సీతాదేవిని లంకేశ్వరుడైన రావణాసురుడి బంధీ నుంచి విడిపించేందుకు లంకకు వెళ్లడమే ఏకైక మార్గం. అయితే, అంతుచిక్కని సముద్రాన్ని దాటడం వానర సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. దీంతో శ్రీరాముడి ఆదేశానుసారం సముద్రంపై వారధి (రామసేతు) నిర్మించేందుకు వానరులు నడుం బిగించారు. నలుడు, నీలుడి సారథ్యంలో వానరులు భారీ పర్వతాలను, బండరాళ్లను తెచ్చి సముద్రంలో వేస్తూ సేతు నిర్మాణంలో నిమగ్నమయ్యారు.
వానర సైన్యం చేస్తున్న ఆ బృహత్కార్యాన్ని గమనించిన ఒక చిన్న ఉడుత.. తానూ స్వామి కార్యంలో భాగస్వామి కావాలనుకుంది. తన శరీరం చిన్నదైనా, తన శక్తి మేరకు సాయం చేయాలని సంకల్పించింది. వెంటనే సముద్రపు నీటిలో మునిగి, ఆ తర్వాత ఇసుకలో పొర్లి, తన ఒంటికి అంటుకున్న ఇసుక రేణువులను తెచ్చి వానరులు వేస్తున్న రాళ్ల మధ్య రాలుస్తూ వచ్చింది. అలా రాళ్ల మధ్య సందులను ఇసుకతో పూడ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది.
మహత్కార్యంలో అల్పజీవి..వానర సైన్యం చేస్తున్న ఆ బృహత్కార్యాన్ని గమనించిన ఒక చిన్న ఉడుత.. తానూ స్వామి కార్యంలో భాగస్వామి కావాలనుకుంది. తన శరీరం చిన్నదైనా, తన శక్తి మేరకు సాయం చేయాలని సంకల్పించింది. వెంటనే సముద్రపు నీటిలో మునిగి, ఆ తర్వాత ఇసుకలో పొర్లి, తన ఒంటికి అంటుకున్న ఇసుక రేణువులను తెచ్చి వానరులు వేస్తున్న రాళ్ల మధ్య రాలుస్తూ వచ్చింది. అలా రాళ్ల మధ్య సందులను ఇసుకతో పూడ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది.
శ్రీరాముడి హితబోధ..ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక వానరుడు ఉడుత చేస్తున్న పనిని చూసి హేళన చేశాడు. 'ఓ చిన్న ప్రాణీ! నీ చిన్న శరీరంతో ఇంత పెద్ద వంతెన నిర్మాణంలో ఏం చేయగలవు..? మా కాళ్ల కింద పడి నలిగిపోతావు, పక్కకు వెళ్ళు'' అంటూ ఎగతాళి చేశాడు.
ఆ మాటలను గమనించిన లక్ష్మణాగ్రజుడు శ్రీరామచంద్రుడు ఆ వానరుడిని వారించాడు. లక్ష్మణ సమేతుడై అక్కడికి వచ్చి, ఆ చిన్న ఉడుతను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా తన అరచేతిలోకి తీసుకున్నాడు. వానర సైన్యాన్ని ఉద్దేశించి శ్రీరాముడు ఇలా అన్నాడు..
'పరిమాణంలో చిన్నదైనా ఈ ఉడుత చూపుతున్న అంకితభావం, నిస్వార్థ భక్తి ఎంతో గొప్పవి. మీరు తెస్తున్న పెద్ద బండరాళ్లను ఒకదానికొకటి బలంగా పట్టి ఉంచేందుకు ఈ ఉడుత తెస్తున్న ఇసుకే సహాయపడుతోంది. కాబట్టి ఎవరి బలగాన్ని చూసి ఎవరూ గర్వపడకూడదు. సేవలో చిన్న, పెద్ద అనే భేదాలు లేవు.'
ఉడుత చూపిన నిరుపమాన భక్తికి పరవశించిపోయిన శ్రీరాముడు, దానిని దీవిస్తూ తన కుడిచేతి మూడు వేళ్లతో ఉడుత వీపుపై సున్నితంగా నిమిరాడు. సాక్షాత్తూ ఆ పరమాత్ముడి వేలి గుర్తులే ఉడుత వీపుపై మూడు తెల్లని చారలుగా మారిపోయాయని పురాణ ప్రతీతి. అప్పటి నుంచి ఉడుత వీపుపై ఆ చారలు శాశ్వతంగా ఉండిపోయాయి. లోకానికి 'ఉడుత భక్తి' అనే పదబంధాన్ని కానుకగా ఇచ్చాయి. భగవంతుడికి మనం సమర్పించే వస్తువు ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న భక్తి శ్రద్ధలే ముఖ్యమని ఈ ఘట్టం మానవాళికి ఎల్లప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post