నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
హిందూ సంప్రదాయంలో అంతిమ యాత్రకు సంబంధించి అనేక నమ్మకాలు, ఆచారాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా 'పాడె' మోయడం విషయంలో ఇప్పటికీ చాలామందిలో రకరకాల సందేహాలు, భయాలు ఉంటాయి. అసలు పాడె మోస్తే ఏం జరుగుతుంది..?పురాణాలు ఏం చెబుతున్నాయి..? అనే విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మానవ జన్మలో చివరి ఘట్టం అంతిమ యాత్ర. ఆ సమయంలో మరణించిన వ్యక్తిని మోసుకెళ్లే పాడెను పట్టుకోవడానికి కొందరు జంకుతుంటారు. అశుభం జరుగుతుందేమోనని, వెనుక ఏవైనా శక్తులు వస్తాయేమోనని భయపడటం మనం చూస్తుంటాం. కానీ, శాస్త్రం ప్రకారం ఇది అపోహ మాత్రమే.
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ఒకరి అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోయడం అనేది అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్నిస్తుందని చెబుతారు. అపరిచితుడైనా సరే, ఒకరిని సాగనంపే క్రమంలో పాడె మోస్తే వెయ్యి యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుందని 'గరుడ పురాణం' చెబుతోంది.
పాప పరిహారం.తెలిసి తెలియక చేసిన ఎన్నో దోషాలు ఒకరి పాడెను మోయడం వల్ల తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు.
చాలామంది భయపడటానికి ప్రధాన కారణాలు..?మృతదేహాన్ని తాకడం వల్ల తమకు లేదా తమ కుటుంబానికి కీడు జరుగుతుందనే అజ్ఞానం. శ్మశానానికి వెళ్లడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుందని భావించడం. మరణాన్ని దగ్గరగా చూడటం వల్ల కలిగే ఒక రకమైన ఆందోళన.
తెలుసుకోవాల్సిన నిజం..?మరణం అనేది ప్రకృతి సహజం. మట్టిలో కలిసి పోయే దేహాన్ని గౌరవప్రదంగా సాగనంపడం మానవ ధర్మం. పాడె మోయడం అంటే ఒక ఆత్మకు ఇచ్చే చివరి గౌరవం. దీనివల్ల కీడు జరుగుతుందనడానికి ఎక్కడా ఆధారాలు లేవు.
ఆచరించాల్సిన నియమాలు..పాడె మోసిన తర్వాత లేదా అంతిమ యాత్రలో పాల్గొన్న తర్వాత కొన్ని సంప్రదాయ నియమాలు పాటిస్తారు. శ్మశానం నుంచి వచ్చాక బయటే స్నానం చేసి ఇంట్లోకి ప్రవేశించాలి. ఇది కేవలం పరిశుభ్రత కోసం ఏర్పరచిన నియమం. స్నానానంతరం దీపాన్ని లేదా అగ్నిని చూడటం వల్ల మనసులోని భయం తొలగిపోతుందని నమ్ముతారు.
పాడె మోయడం అనేది భయపడాల్సిన విషయం కాదు, అది ఒక సేవా గుణం. తోటి మనిషికి ఇచ్చే తుది వీడ్కోలులో భాగస్వాములు కావడం వల్ల మనసు నిర్మలమవుతుంది. జీవితం శాశ్వతం కాదనే పరమార్థం బోధపడుతుంది. కాబట్టి అపోహలను వీడండి, సంప్రదాయాన్ని గౌరవించండి.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post