కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. హైదరాబాద్ వాసుల కోసం ప్రత్యేకంగా ‘తిరుపతి బాలాజీ దర్శనం’ (Tirupati Balaji Darshanam Ex Hyderabad) పేరుతో విమాన ప్యాకేజీని ప్రకటించింది. 1 రాత్రి, 2 రోజుల వ్యవధితో కూడిన ఈ ప్రయాణానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్, తాజా అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
ప్యాకేజీ ముఖ్యాంశాలు (కోడ్: SHA01)..
ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక ప్యాకేజీ ద్వారా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సౌకర్యవంతంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు.
వ్యవధి ఎంత..? ఒకరాత్రి / 2 రోజులు (విమాన ప్రయాణ మార్గం)
సందర్శించే క్షేత్రాలు..
తిరుమల (శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం), కణిపాకం (వరసిద్ధి వినాయక స్వామి), శ్రీకాళహస్తి (శ్రీ కాళహస్తీశ్వర ఆలయం), శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు (శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం).
సౌకర్యాలు..
విమాన టిక్కెట్లు, తిరుపతిలో ఏసీ హోటల్ వసతి, రుచికరమైన ఆహారం.. భోజనం,అల్పాహారం, స్థానిక సందర్శన కోసం ఏసీ వాహన సౌకర్యం, తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు అన్నీ ఐఆర్సీటీసీనే స్వయంగా ఏర్పాటు చేస్తుంది.
ధరల వివరాలు..
ఈ ప్యాకేజీ ధరలను ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఒంటరిగా ప్రయాణించాలనుకునే భక్తులకు సింగిల్ ఆక్యుపెన్సీ కింద ఒక్కొక్కరికి రూ.16,330/- గా ఖరారు చేశారు. అలాగే ఇద్దరు వ్యక్తులు కలిసి రూమ్ పంచుకునేలా అంటే డబుల్ ఆక్యుపెన్సీ, బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.14,645/- చొప్పున ఛార్జీ వర్తిస్తుంది. ఒకవేళ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకే గదిని పంచుకుంటూ అంటే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ప్రయాణించాలనుకుంటే, ప్యాకేజీ ధర మరింత తగ్గి ఒక్కొక్కరికి రూ.14,550/- గా నిర్ణయించారు. భక్తులు తాము ఎంచుకునే వసతి విధానాన్ని బట్టి ఈ నిర్దేశిత రుసుములను చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులకు నిబంధనలు..
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిబంధనల ప్రకారం దర్శన సమయానికి భక్తులందరూ తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. అలాగే సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు: ధోవతి, కుర్తా పైజామా, మహిళలు శారీ లేదా చుడీదార్ నియమాన్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. జీన్స్, టీ-షర్టులు ధరించిన వారికి దర్శనానికి అనుమతి ఉండదు. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక విమాన ప్యాకేజీ ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా శ్రీవారి కృపకు పాత్రులు కావాలనుకునే వారు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ టిక్కెట్లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు.
