తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం దేవస్థానంలో రేపటి నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే ఈ పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also This:
శని, రాహు-కేతు దోషాల నివారణకు గంగాజలంతో అద్భుత పరిహారాలు..!
భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. స్నాన ఘాట్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటి రోజు పుణ్యస్నానాలకు పలు పీఠాధిపతులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.
భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 3,360 ప్రత్యేక బస్సులను నడపనుంది. మొత్తం 5,772 ప్రత్యేక ట్రిప్పులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా వసూలు చేయనున్నప్పటికీ, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు.
ఈ పుష్కరాల సందర్భంగా రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్, క్యూ లైన్లు, డ్రోన్ పర్యవేక్షణ వంటి చర్యలు కూడా అమల్లోకి తీసుకువస్తున్నారు.
