నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉన్నారు. కెరీర్ ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు సర్వసాధారణం అయిపోయాయి. అయితే, సనాతన ధర్మం మరియు జ్యోతిష్య శాస్త్రంలో ఈ రోజువారీ సమస్యలను అధిగమించడానికి ఎన్నో సులభమైన మార్గాలు సూచించబడ్డాయి. అందులో పసుపుతో చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితంలో సానుకూల దృక్పథాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుందని పండితులు చెబుతున్నారు.
పసుపు గురువారం ప్రాముఖ్యత..
గురువారం దేవగురువు బృహస్పతికి అంకితం చేయబడిన రోజు. గురు గ్రహం జ్ఞానం, సుఖసంతోషాలు, అదృష్టం,సానుకూలతకు ప్రతీక. మన వంటగదిలో సులభంగా దొరికే పసుపు కేవలం వంటలకు రంగు, రుచిని మాత్రమే కాకుండా, జ్యోతిష్యపరంగా విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది.
భారతీయ సంప్రదాయంలో పసుపును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది స్వచ్ఛత, ఆరోగ్యం,దైవానుగ్రహానికి ప్రతీక. పసుపు పచ్చని రంగు నేరుగా గురు గ్రహానికి సంకేతం కాబట్టే, పూజాది కార్యక్రమాలలో దీనికి అంతటి ప్రాధాన్యత ఉంది.
పరిహారం ఎలా చేయాలి..?
ఈ పరిహారాన్ని గురువారం నాడు చేయడం అత్యంత శుభప్రదం. ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ విధంగా చేయండి...
సంకల్పం..ముందుగా మీ కుడి చేతిలో చిటికెడు పసుపు తీసుకోండి.
దైవ ప్రార్థన..కళ్ళు మూసుకుని, మీ మనస్సులో ఒక బలమైన, సానుకూలమైన కోరికను స్మరించుకోండి. అది ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభం, లేదా కుటుంబంలో శాంతి ఏదైనా కావచ్చు.
సానుకూల భావన..విజయం, ప్రశాంతత మరియు సానుకూల శక్తి నలువైపుల నుండి మీ వద్దకు వస్తున్నట్లుగా మనస్ఫూర్తిగా భావించండి.
పరిహారం పూర్తి చేయడం..ఇప్పుడు ఆ చిటికెడు పసుపును మీ వంటగదిలోని సింక్లో వేయండి.
కృతజ్ఞత..చివరగా, దేవుని పట్ల కృతజ్ఞతా భావంతో (Gratitude) నీరు పోసి ఆ పసుపును కడిగేయండి.
నీటితో పాటు పసుపును సింక్లో కడిగేయడం ద్వారా, మన జీవితం, మన ఇంటిలో నిలిచిపోయిన ప్రతికూల శక్తి (Negative Energy) కూడా కొట్టుకుపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇది జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది.
నమ్మకం, కర్మల కలయిక..
ఏదైనా పరిహారం పనిచేయాలంటే మనస్సులో నిజమైన భక్తి, నమ్మకం ఉండాలి. కేవలం పరిహారాలు చేయడం వల్లే అద్భుతాలు జరిగిపోవని గుర్తుంచుకోవాలి. దీనికి మీ కఠోర శ్రమ, సత్ప్రవర్తన, లక్ష్యాల పట్ల చిత్తశుద్ధి తోడైనప్పుడే, భగవంతుని ఆశీస్సులు మెండుగా లభించి ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి.
